Dinner in Space: అంతరిక్షంలో డిన్నర్.. ఒక్కో టిక్కెట్ రూ.4.41 కోట్లు!

  • ఔత్సాహిక పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రను ప్రకటించిన స్పేస్‌వీఐపీ
  • బెలూన్ ద్వారా పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్న వైనం
  • అక్కడే డిన్నర్‌కు ఏర్పాట్లు, ఇందు కోసం ప్రత్యేక మెనూకు ఏర్పాట్లు
  • డిన్నర్ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ చేసే సౌలభ్యం, వచ్చే ఏడాది ట్రిప్‌ను నిర్వహించనున్న సంస్థ
  • నాసా అందించిన బెలూన్‌తో ట్రిప్ నిర్వహణ
Dinner In Space By Michelin Starred Chef To Cost Half A Million Dollars

అంతరిక్ష పర్యాటకం ఊపందుకుంటున్న నేపథ్యంలో వ్యాపారవేత్తలు కొంగొత్త ఐడియాతో ముందుకొస్తున్నారు. తాజాగా ఓ సంస్థ అంతరిక్షంలో డిన్నర్ చేసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. బెలూన్‌ ద్వారా నిర్వహించే ఈ ట్రిప్‌కు స్పేస్‌వీఐపీ అనే సంస్థ రూపకల్పన చేసింది. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటన కోసం కంపెనీ ఇప్పటికే ప్రముఖ డానిష్ షెఫ్ ను(పాకశాస్త్రనిపుణుడు) రంగంలోకి దింపింది. ప్రపంచంలో ఐదో అత్యద్భుత రెస్టారెంట్‌గా పేరు పడ్డ ప్రముఖ డానిష్ రెస్టారెంట్‌లో ఆయన షెఫ్‌గా ఉన్నారు. హైటెక్ స్పేస్ బెలూన్‌ లో అతిథులకు షెఫ్ స్వయంగా ఆహారాన్ని వండనున్నారు. 

ఈ ట్రిప్‌లో భాగంగా పర్యాటకులు లక్ష అడుగుల ఎత్తున అంతరిక్షంలో సూర్యోదయ, సూర్యాస్తమయాల్ని ఆస్వాదిస్తూ డిన్నర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఈ డిన్నర్‌లో వడ్డించే ఆహారాన్ని రాస్మస్ మంక్ ఎంపిక చేయనుంది. అంతేకాదు, డిన్నర్ మొత్తాన్ని భూమ్మీదున్న శ్రేయోభిలాషులు, మిత్రులకు లైవ్‌స్ట్రీమ్ చేసే అవకాశం కూడా అతిథులకు కల్పించారు. ఇందుకోసం బెలూన్‌లో అత్యాధునిక వైఫై ఏర్పాటు చేశారు. ఈ జర్నీ మెనూ ఇంకా సిద్ధం కాలేదు. అయితే, ట్రిప్‌లాగానే మెనూ కూడా సృజనాత్మకంగా ఉండబోతోందని ప్రధాన షెఫ్ తెలిపారు. 

ఈ పర్యటనకు మొత్తం ఆరుగురిని అంతరిక్షంలోకి తీసుకెళతారు. ఒక్కో టిక్కెట్ ధర సుమారు 5 లక్షల డాలర్లుగా (సుమారు రూ.4.14 కోట్లు) ఉండొచ్చని సమాచారం. ధర ఇంత భారీగా ఉన్నా ఔత్సాహిక పర్యాటకులు మాత్రం వెనక్కుతగ్గలేదు. ట్రిప్ గురించి ప్రకటించిన 24 గంటల లోపే అనేక మంది తమ పేర్లు రిజిస్టర్ చేసుకుంటామంటూ ముందుకొచ్చారు. 

ఈ ట్రిప్‌లో భాగంగా అతిథులను ప్రత్యేక క్యాప్సూల్‌లో కూర్చోబెడతారు. నాసా సిద్దం చేసిన అంతరిక్ష బెలూన్ల సాయంతో ఈ క్యాప్సూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళతారు. ఈ ట్రిప్‌లో పాల్గొనేందుకు ముందస్తు ట్రెయినింగ్ ఏదీ అవసరం లేదని స్పేస్ వీఐపీ పేర్కొంది. వచ్చే నెల నుంచి ఈ క్యాప్సూల్, బెలూన్లపై పరీక్షలు మొదలవుతాయని పేర్కొంది.

View this post on Instagram

A post shared by ΛLCHEMIST (@restaurantalchemist)

More Telugu News